సృష్టి కాల గణన



మన భారతీయులకు ఉన్న అపార సంపద వేదాలు. వేదాలు నాలుగు. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం . వీటిలో అతి ప్రాచీనమైనది ఋగ్వేదం. వేదకాలాన్ని లెక్కించడానికి వేదాలలో వర్ణించబడిన వివిధ సంఘటనలు, ఆనాటి జీవన పరిస్థితులను ఆధారం చేసుకొని చరిత్రకారులు క్రీ. పూ 6000 నుండి క్రీ. పూ 3000 వరకు వేదకాలంగా నిర్ణయించారు. ఆనాటి ఋగ్వేదం లోనే గణితపరమైన , ఖగోళ పరమైన ప్రస్తావనలున్నాయి.
       "శీక్ష విభిందో అష్టై చత్వార్యయుతా, దదత్ అష్టాపరః సహస్ర " అంటే ఒక కల్పము నందు 4320000000  సంవత్సరాలుంటాయి. కల్పము ప్రమాణం పదిస్థానాలు గల సంఖ్య అని వేదంలో చెప్పబడింది.
       హిందూ గణన ప్రకారం ఒక మహాయుగంలో 4320000 సంవత్సరాలుంటాయి. దీనిలో 4 యుగాలుంటాయి. అవి కృతయుగం , త్రేతాయుగం, ద్వాపరయుగం, కలి యుగం. యుగాలన్నీ వరసగా 4:3:2:1     లో ఉంటాయి. అంటే
కృతయుగం కాలం =  4/10 x 4320000 = 17,28,000సంవత్సరాలు
త్రేతాయుగం కాలం = 3/10 x 4320000 = 1296000సంవత్సరాలు
ద్వాపర యుగం కాలం = 2/10 x 4320000 = 864000 సంవత్సరాలు

కలియుగం కాలం = 1/10 x 4320000 =432000సంవత్సరాలు

       ఒక కల్పంలో 14  మన్వంతరాలుంటాయి
ఒక మన్వంతరంలో 71 మహాయుగాలుంటాయి.
ఇప్పటికి 6 మన్వంతరాలు అయాయి. అంటే 6 మన్వంతరాలు  x 71 మహాయుగాలు x 4320000 =1840320000 సంవత్సరాలు.
 7 మన్వంతరంలో 27 మహాయుగాలు గడిచాయి. అంటే 27 x 4320000 = 116640000 సంవత్సరాలు.

 7 మహాయుగంలో కలి యుగం జరుగుతోంది. సుమారు 4000000 సంవత్సరాలు. కలుపుకోండి. గణన ప్రకారం చూస్తే సృష్టి ప్రారంభమై సుమారు (1840320000 + 116640000 + 4000000 = 1960960000   సంవత్సరాలు) అయింది
       నేటి ఆధునిక శాస్త్రవేత్తలు, ఆధునిక యంత్రపరికరాల సహాయంతో లెక్కించగా అది 2000000000 సంవత్సరాలుగా తేల్చారు. దీనికి మరి ఏమనగలం .


మరిన్ని విషయాలను తర్వాత పోస్ట్ నందు చర్చిద్దాము

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం