కాళ్ళు తడవకుండా సముద్రం దాటచ్చు కాని కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము . ఇది పెద్దలు చెప్పిన మాటల్లో ఒకటి . అంటే జీవితంలో కష్ట సుఖాలు అనేవి తప్పవు ఏదో ఒక సందర్భంలో దుఃఖం రాకుండా ఉండదు కదా అనే జీవిత సత్యాన్ని అలా చెప్పారు . కాని సముద్రాన్ని చూస్తే అసలు కాళ్ళు తడవకుండా ఉండగలరా ఎవరన్నా ? కాకినాడ సముద్ర తీరంలో సూర్యోదయం చూడాలనిపించింది . ఉదయాన్నే బయలుదేరాం . అప్పటికి ఇంకా అరుణోదయం కూడా కాలేదు . ఈ రోజు మబ్బుగా ఉండటం వల్ల కాబోలు . కాని జీవన యానం తప్పదు కదా ? అప్పుడే వలలు సర్దుకొని చేపల వేటకు బయలుదేరుతున్న గంగపుత్రులను చూడండి . అవును ఈ రోజు మాఘమాసపు ఆదివారం కదా ! చూసారా ఉదయాన్నే సముద్ర స్నానానికి వచ్చిన భక్తురాళ్ళని . అదుగో అరుణోదయం . అదుగో సూర్యుడు అంటూ తమ్ముడికి చూపిస్తున్న అన్నయ్య . ఎవరో ఒకాయన చూడండి సూర్యబింబాన్ని ఒడిసిపట్టాలని చూస్తున్నాడు . అదుగో సూర్యుడు నెమ్మదిగా ...
వేదాలలో గణితశాస్త్రానికి ప్రముఖ స్థానం ఇచ్చారు . ఈ శ్లోకం చూడండి . " యధా శిఖా మయూరాణాం నాగానాం మణయో యధా తద్వద్వేదాంగ శాస్త్రాణం గణితం మూర్ధని స్థితమ్ " . " నెమళ్ళకు శిఖల వలె , పాములకు మణులవలె , వేదాంగ శాస్త్రాలన్నింటికీ శిరస్సున గణితం ఉంది . " అని అర్ధాన్నిచ్చే ఈ శ్లోకం వలన గణితానికి వేదకాలంలో ఉన్న ప్రాముఖ్యతను అర్ధం చేసుకోవచ్చును . ఆనాడు కాలం , ముహుర్తం , వంటి కాలప్రమాణాలు , గ్రహగతులు వాటి ప్రభావం , సూర్య చంద్రులు , నక్షత్రముల స్థితిగతుల గురించి వారికి గల గణిత పరిజ్ఞానం ఎంతో అపారం . ఎప్పుడో రాబోయే సూర్య , చంద్ర గ్రహణాలు , కురవబోయే వర్షాలు , కాయబోయే ఎండలు , అన్నింటినీ ముందే లెక్కించే వారు . వేదకాలంలో యజ్ఞ వాటికల నిర్మాణం , అ...
హరిదాసు కీర్తనలు సంక్రాంతి అనగానే గుర్తుకు వచ్చేది హరిదాసు కీర్తనలు కూడా . తెలతెల వారుతూనే , మంచుతెరలు చీల్చుకొంటూ నును వెచ్చని సూర్యకిరణాలు సుతారంగా తాకుతుండగా " హరిలో రంగ హరి " అంటూ హరినామ స్మరణతో వచ్చే హరిదాసులు గుర్తుకు రాక తప్పరు . పట్టుపంచె కట్టుకొని , ఉత్తరీయం కప్పుకొని , కాళ్ళకు ఘల్లు ఘల్లున గజ్జెల రవాలతో , నుదుట వైష్ణవ నామాలతో , నెత్తిన శుభ్రంగా మిలమిలలాడేలా నున్నగా తోమిన ఇత్తడి లేదా రాగి కూష్మాండ పాత్ర , చుట్టూ చుట్టిన రంగు రంగుల పూలదండతో , మెడలో పువ్వుల హారంతో , చేతిలో చిడతలు వాయిస్తూ వస్తారు హరిదాసులు . హరిదాసును సాక్షాత్తు ఆ వైకుంఠ వాసి లక్ష్మీపతి శ్రీమన్నారయణునిగా పూజించటం మన సాంప్రదాయం . ఏ ఇంటి ముందు ఆగి యాచించరు వీరు . మనమే ముందుగా చేత పాత్రతోబియ్యం పట్టుకొని నిలబడితే మాత్రమే ఆగుతారు . చిన్నతనంలో హరిదాసు ఏ రంగు పట్టుపంచె కట్టుకొని వస్తాడు ఈ రోజు అనుకొంటూ ఆత్రుతగా ఎదురుచూసేవాళ్ళం . ఆయన పాత్రలో బియ్యం నేను వేస్తానంటే నేను వేస...
కామెంట్లు