శ్రీరంగపట్న విశేషాలు చూడండి
ఇక్కడి దేవాలయం
చాలా పెద్దదిగా , విశాలంగా నిర్మించబడినది
తొమ్మిదవ శతాబ్దం లో గంగ వంశపు రాజులచే నిర్మించబడి, హోయసల , విజయనగర రాజులచే ఆధునికీకరించబడినది . ఈ క్షేత్రం దక్షిణ
భారత దేశంలో పంచరంగ క్షేత్రములలో ఒకటిగా పేరొందినది. దీనిని ఆదిరంగా క్షేత్రం
అంటారు. స్వామి పడగ విప్పి, చుట్టాలు చుట్టుకొని ఉన్న ఆదిశేషునిపై పవళించి ఉంటాడు.
కాళ్ళవద్ద లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది . పెద్ద పెద్ద ప్రాకారాలు, తటాకం కలిగి
ఉంటుంది. ప్రాకారంలో చుట్టూ హనుమాన్,
గరుడ, ఆళ్వార్ లకు దేవాలయాలు ఉన్నాయి.