మైసూర్ చూసొద్దాం రండి ......
బెంగుళూరు
నుంచి మనం చూడవలసిన ప్రదేశాలు అనగానే అందరికి గుర్తుకు వచ్చేది మైసూర్ .
బెంగుళూరు తరవాత బాగా అభివృద్ధి చెందిన
నగరం ఇది. నిజానికి బెంగుళూరు మైసూర్
రాజ్యంలో ఒక నగరంగా ఉండేది. తరువాత కర్ణాటక రాజధానిగా మారింది. బెంగుళూరు
రాజధానిగా , ఐ.టి హబ్ గా ప్రసిద్ధి
చెందితే మైసూర్ చారిత్రక నగరంగా ప్రసిద్ధి పొందింది .
మైసూర్
బెంగుళూరు కు సుమారు 1 4 0 కి.మీ దూరంలో
ఉంది. బెంగుళూరు నుంచి మైసూర్ కు నాలుగు వరుసల జాతీయ రహదారి ఉంది. బెంగుళూరు లో బయలుదేరితే
సుమారు 5 0 కి.మీ వెళ్లేసరికి రామనగర్ వస్తుంది. ఇది సిల్క్ సిటిగా పేరు పొందింది
. ఇక్కడ పట్టుపురుగుల ఉత్పత్తి కేంద్రం, అనేక పట్టు ఉత్పత్తులు అమ్మే షాప్స్
కనిపిస్తాయి.