మాండ్య ది షుగర్ సిటీ
తరువాత ఒక ఇరవై కిలోమీటర్లు వెళితే మాండ్య వస్తుంది. దీనిని షుగర్ సిటీ అంటారు. ఇక్కడ ఎక్కువగా చెరుకు పండుతుంది. షుగర్ ఫాక్టరీ ఉంది.
మరో ఇరవై రెండు కి,మీ వెళితే శ్రీరంగపట్నం వస్తుంది. ఈ ఊరు మాండ్య జిల్లాలో ఉంది. దీనిని పూర్వం “శిరంగ్ పట్టణ “ అనేవారట. నగరం అంతా కూడా కావేరి నదితో చుట్టబెట్ట బడి ఉంటుంది . ఒక ద్వీపం వలె ఉంటుంది. ఇక్కడ శ్రీరంగనాధ ఆలయం చాలా ప్రసిద్ది చెందినది. రాజగోపురం చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ ఆలయాన్ని గంగ వంశపు రాజులు నిర్మించారు. హోయసల, విజయనగర రాజులు సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ఆలయం తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించబడినది.