టిప్పు సుల్తాన్ విశేషాలు
టిప్పు
సుల్తాన్ మరియు ఆయన తండ్రి హైదర్ ఆలీ
శ్రీరంగపట్టణాన్ని రాజధానిగా చేసుకొని మైసూర్ రాజ్యాన్ని పాలించారు.
ఇక్కడ వారు
కట్టించిన కోట, జుమా మసీద్, గుంబజ్, మొదలైనవి చూడవచ్చును.
ఆంగ్లేయులు, హైదరాబాదు నిజాం
ఈయనపైకి దండేత్తి వచ్చినపుడు టిప్పు సుల్తాన్ సైనికులలో కొందరు ద్రోహబుద్దితో
శత్రువులతో చేతులు కలిపి కోటకు మంచినీరు సరఫరా చేసే రహస్య ద్వారాన్ని తెరవడం
ద్వారా లోపలి ప్రవేశించి టిప్పుని సంహరించారు.
ఆయన దుస్తులు, ఖడ్గం అనేక విలువైన
నగలు, సామగ్రి, దోచుకొని పోయారు. ఇందులో కొన్ని లండన్ మ్యూజియం నందు పెట్టారు .
ఖడ్గాన్ని వేలం వేస్తుంటే మద్యం వ్యాపార్ విజయ మాల్యా వేలం పాడి మనదేశానికి
తెచ్చారు. ఎంతో విలువైన మన సంపద ఇప్పటికి పరాయి దేశాలలో ఉంది.
ఇక్కడే టిప్పు సుల్తాన్ మరణించారు
. ఈ ప్రదేశాన్ని స్మారక చిహ్నంగా తయారుచేసారు.