చాముండి హిల్స్ విశేషాలు తెలుసుకుందాం
మైసూర్ నగరంలో ఉన్న కొండను చాముండి హిల్స్
అంటారు. ఈ కొండపై కొలువున్న చాముండేశ్వరి దేవి పేరుమీద ఈ కొండకు ఆ పేరు వచ్చింది. కన్నడలో
ఈ కొండను చాముండి బెట్ట అంటారు. మనం కొండలను మెట్ట, మిట్ట అంటాము కదా అలాగ అన్నమాట
. ఈ క్షేత్రం అష్టాదశ శక్తీ పీఠములలో
ఒకటైన క్రౌంచ పట్టణం ఇదే. ఇక్కడి చాముండేశ్వరి ని మహిషాసురమర్దని అని కూడా
పిలుస్తారు. ఆ పేరు మీద మహిషుర్ అని పిలువబడి క్రమేపి మైసూర్ గా మారింది.
ఈ
కొండ సుమారు 1000మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ కొండ దక్షిణ భారత దేశంలోని 8 పవిత్రమైన వాటిలో ఒకటి.
ఈ దేవాలయాన్నిమైసూర్ మహారాజులు బాగా
తీర్చిదిద్దారు. ప్రతీ ఏడాది దసరాలకు ఇక్కడ జరిగే ఉత్సవాలు దేశవిదేశాలలో బాగా
ప్రసిద్ధి చెందినది. అప్పుడు జరిగే ఉత్సవాలలో ఏనుగుపైన , రధంపైన , జరిపే
ఊరేగింపులు కన్నుల పండువగా ఉంటాయి. మైసూర్ నగరమంతా పెట్టే విద్యుత్ దీపాలంకరణ
చూడటానికి రెండు కళ్ళు చాలవు. ఈ ఉత్సవాల సందర్భంగా మైసూర్ మహారాజులు దర్భార్ ను
నిర్వహిస్తారు.
ఈ కొండపై మరో ఆకర్షణ 16 అడుగుల ఎత్తైన నంది
విగ్రహం. ఇది చాలా అందంగా చెక్కబడింది. అయినా కర్ణాటక లో ఎక్కడ చూసినా నంది విగ్రహాలే
ఎందుకంటే ఇక్కడి రాజులు అందరూ వీర శైవాన్ని బాగా ఆదరించారు కాబట్టి .
ఇదే కొండపై
మహిషాసురుని విగ్రహం కూడా ఉంటుంది. ఒకచేతితో పెద్ద కత్తిని, మరో చేతితో ఒక పామును
పట్టుకొని ఉన్న ఆ విగ్రహం
చూడవలసినదే. ఈ కొండపై నుండి చూస్తే నగరమంతా
కనిపిస్తుంది. మైసూర్ మహారాజు పేలస్, లలిత మహల్ పేలస్ . రేసు కోర్స్ అన్ని చక్కగా
కనిపిస్తాయి.
కామెంట్లు