ఆదునికవిజ్ఞానము వినియోగం

ఆదునికవిజ్ఞానము వినియోగం

                మానవ పరిణామక్రమం లో సామాజికంగా , సాంకేతికంగా ,అనేకమార్పులు జరగటం అనేది చాల మంచి పరిణామమే . అడవుల్లో , గుహల్లో చెట్లు  పుట్టలను  తిరుగుతూ ఉండే మానవుడు  ఆకులు అలములు పచ్చి మాంసం తింటూ తిరిగేవాడు . నిప్పుని కనిపెట్టడము తో ఆహారం విషయములో చాల మార్పులు వచ్చాయి . వండుకు తినడం మొదలుపెట్టాడు . చక్రం కనిపెట్టడం తో మానవజీవితం ఉహించని విధంగా మారిపోయింది . ఎన్నో రకాల యంత్రాలు తయారయ్యాయి . వాహనాలు,యంత్రాలు,రైల్ బండి ,విద్యుత్ ఇలా చాలా సాధనాలు వాడకం లోకి రావడం తో మానవుడు ఆధునిక జీవితానికి అలవాటు పడి పోయాడు .
               ఇంతవరకు బాగానే ఉంది కాని మనిషి ఆధునిక విజ్ఞానం మీద మరీ ఎక్కువగా అధారపడి పోతున్నాడేమో అనిపిస్తుంది . చాల మంది పిల్లలిని చూడండి స్కూల్ నుంచి రాగానే హోం వర్క్ అది ఫ్రెండ్స్ కి ఫోన్లు , మెసేజ్లు చేస్తూ కనుక్కుని చేస్తారు . ఉదయం నుంచి స్కూల్ లో ఏమి చేస్తారో తెలీదు.
               మొన్న బట్టల దుకాణానికి వెళ్ళాను . ఒక అమ్మాయి నచ్చిన డ్రసులు ఫోటోలు, వేసుకొని ఒకసారి ఫోటోలు తీసుకోవడము ఫోన్ లో వాట్స్ ఆప్ లాంటి మెసెంజర్ లో వాళ్ళ ఫ్రెండ్స్ కి పంపడం వాళ్ళు చూసి సెలెక్ట్ చేయడం జరిగింది.
               ఇంజనీరింగ్ చదివే మా అబ్బాయి ఇంటికి ఇచ్చిన ఎస్సైన్ మెంట్లు రాసి ఫోటోలు తీసి ఫ్రెండ్స్ తో పంచు కుంటు చేస్తున్నాడు .
               అమెరికా లో ఉన్న మా స్నేహితుని కొడుకు వాళ్ళ అబ్బాయి బారసాల , సత్యనారాయణ వ్రతం ఇక్కడ నుంచి పురోహితుడు చేయిస్తే అక్కడ చేసుకున్నాడు . ఆఖరికు పెళ్ళిచూపులు ఆన్ లైన్ లోనె జరిగిపోతున్నాయి . విదేశాల్లో ఉన్న మన వాళ్ళు ఇక్కడ జరిగే కార్యక్రమాలను వీడియో చాటింగ్ లో చూసేస్తున్నారు.
               అందుకే నేమో ప్రపంచం అంతా ఒక కుగ్రామం అయిపోతోంది ఆధునిక విజ్ఞానం పుణ్యమా 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం