‘నపథ్యమ్ కదళీ ఫలమ్’







వందగ్రాముల అరటిపళ్లలో నీరు - 70.1 గ్రా.,ప్రోటీన్ - 1.2 గ్రా, కొవ్వుపదార్థాలు - 0.3 గ్రా., పిండి పదార్థాలు - 27.2 గ్రా.. కాల్షియం - 17 మి.గ్రా. ఇనుము - 0.4మి.గ్రా.  సోడియం - 37 మి.గ్రా., పొటాషియం - 88 మి.గ్రా.ఇంకా రాగి , జింకు లాంటి ఖనిజాలు, లవణాలు, విటమిన్లూ ఇందులో ఉన్నాయి. 23% ఉన్న కార్బోహైడ్రేట్లవలన 7% నీళ్ళు ఉన్నప్పటికీ, వీటినుండి రసం వేరు కాదు.  మిక్సీ పట్టినా అది గుజ్జుగా మారిపోతుందే తప్ప రసంగా రాదు. భాభా ఆటామిక్‌ పరిశోధనా సంస్థ వారు ఓ ప్రతేకమైన పద్ధతిలో అరటి పళ్ళ రసాలు తయారు చేసి పేటెంటు పొందారు. అధిక కార్బోహైడ్రేట్లవలన షుగరు వ్యాధి, స్థూలకాయం ఉన్నవారికి ఇవి వ్యాధిని పెంచేదిగానే ఉంటాయి
నపథ్యమ్ కదళీ ఫలమ్ అన్నారు. అరటి పండును అన్ని జబ్బుల్లోనూ పెట్టవచ్చని దీని భావం.


·         దీనిలో అత్యధికంగా ఉండే పొటాషియం బీపీ, అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
·         శరీరంలోని విషపదార్థాల (టాక్సిన్స్)ను తొలగిస్తుంది.
·         రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుందని చెబుతారు.
·         అరటిపండులోని పొటాషియం శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
·         జబ్బుపడినవాళ్ళకి అరటి పళ్ళు శక్తిదాయకంగా ఉంటాయి.
·         పచ్చి అరటి కాయలు విరేచనాలనూ, పండిపోయినవి మలబద్ధకాన్నీ అల్సర్ల నూ అరికడతాయి.కడుపులో) యాసిడ్ని తగ్గిస్తాయి. పేగుపూత ఉన్నవారికి ఇది మంచి ఆహారం
·         అరటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు అదుపులో ఉండేలా చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పొటాషియం


·         అరటిపండులో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండెజబ్బుల్ని నివారించడమే కాకుండా ఎముకల ఆరోగ్యాన్నీ కాపాడతాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం