హరిదాసు కీర్తనలు
హరిదాసు కీర్తనలు సంక్రాంతి అనగానే గుర్తుకు వచ్చేది హరిదాసు కీర్తనలు కూడా . తెలతెల వారుతూనే , మంచుతెరలు చీల్చుకొంటూ నును వెచ్చని సూర్యకిరణాలు సుతారంగా తాకుతుండగా " హరిలో రంగ హరి " అంటూ హరినామ స్మరణతో వచ్చే హరిదాసులు గుర్తుకు రాక తప్పరు . పట్టుపంచె కట్టుకొని , ఉత్తరీయం కప్పుకొని , కాళ్ళకు ఘల్లు ఘల్లున గజ్జెల రవాలతో , నుదుట వైష్ణవ నామాలతో , నెత్తిన శుభ్రంగా మిలమిలలాడేలా నున్నగా తోమిన ఇత్తడి లేదా రాగి కూష్మాండ పాత్ర , చుట్టూ చుట్టిన రంగు రంగుల పూలదండతో , మెడలో పువ్వుల హారంతో , చేతిలో చిడతలు వాయిస్తూ వస్తారు హరిదాసులు . హరిదాసును సాక్షాత్తు ఆ వైకుంఠ వాసి లక్ష్మీపతి శ్రీమన్నారయణునిగా పూజించటం మన సాంప్రదాయం . ఏ ఇంటి ముందు ఆగి యాచించరు వీరు . మనమే ముందుగా చేత పాత్రతోబియ్యం పట్టుకొని నిలబడితే మాత్రమే ఆగుతారు . చిన్నతనంలో హరిదాసు ఏ రంగు పట్టుపంచె కట్టుకొని వస్తాడు ఈ రోజు అనుకొంటూ ఆత్రుతగా ఎదురుచూసేవాళ్ళం . ఆయన పాత్రలో బియ్యం నేను వేస్తానంటే నేను వేస...

కామెంట్లు