పోస్ట్‌లు

ఆయనకు కోపం వస్తే ....

"నేను గట్టిగా విసుక్కొంటే మా ఆయనకు కోపం వస్తుంది తెలుసా" అంది సరళ తన స్నేహితురాలితో. "అవునా, మరి అప్పుడేం చేస్తావు? " అడిగింది ఆ స్నేహితురాలు. " ఆ పూటకి బోజనం చేయను " అంది సరళ . "అబ్బ మీ ఆయనంటే ఎంత ప్రేమోనీకు " అంది స్నేహితురాలు. "ప్రేమా , దోమా ఆయనకు కోపం వస్తే వంట చేయరు " చెప్పింది సరళ . 

పంచేంద్రియాల బందిఖానా

        మానవుడి దేహం పంచభూతాత్మకం . పంచేంద్రియ సహితమైన ఈ దేహం ఆ పం చేం ద్రియాలకే లోబడి యుండి రకరకాల ప్రలోభాలకు లొంగుతూ ఉంటుంది . మానవుడు తన విచక్షణా జ్ఞానాన్ని వినియోగించి ఈ పం చేం ద్రియాల మాయలో పడకుండా తప్పించుకోగలిగితే మనిషి మహనీయుడే . ఆ పంచేంద్రియాల మాయ ఎలా ఉంటుందో " వివేక చూడామణి " లో వివరించారు . ఒకసారి మనం పరిశీలిద్దాం .        శబ్ద , రూప , రస , స్పర్శ , గంధాలకు వశమై జీవులు ఎలా ప్రాణాలు కోల్పోతున్నాయో చూడండి .        జింకలు అడవిలో తిరుగుతూ ఉండగా వేటగాడు ఊదుతున్న వేణునాదం విని ఆ ’ శబ్దానికి ’ వశమై అలా అలా వచ్చి వేటగాడికి చిక్కుతుంది .        మిడుతలు చీకటిలో మండుతున్న మంటలను చూసి   ’ రూపానికి ’ ఆకర్షితమై మంటలు ప్రమాదకరం అన్న విషయం తెలియక ఆ మంటలలో పడి మాడి మసి అవుతాయి .         మగ ఏనుగులు ఆడఏనుగు యొక్క పొందుతో కలిగే " స్పర్శా సుఖం " కోసం పరితపిస్తూ దా...

టామ్ & జెర్రీ

చిత్రం
ఒక వారం రోజులనుంచి నిద్ర పట్టడం లేదు సరిగా . అబ్బే ఉక్కపోత అదీ కాదండీ . మా ఇంట్లోకి ఎలా చేరిందో కాని ఒక ఎలుక పిల్ల చేరిందండీ బాబూ ! ఇంక దానితో నాకు సమస్యలు మొదలయ్యాయి . ఒకసారి పుస్తకాల అలమారులో చేరి శబ్దం చేయడం , మరోసారి ఫ్రిజ్ పైకి ఎక్కి తొంగిచూడటం , డైనింగ్ టేబుల్ మీద ఏమైనా వదిలేసినవి తిని పాడు చేయడంతో దాని లీలలు బయటపడ్డాయి .  మొదట్లో అంత పట్టించుకోలేదు దాన్ని మేము . దాని ఆగడాలు అంతకంతకు మించి పోతున్నాయి . ఒకరోజు మా అమ్మాయి అమెరికన్ టూరిస్టర్ బాగ్ కి కన్నం , మరో రోజు మా శ్రీమతి హేండ్ బేగ్ కి కన్నం అలా మొదలయింది . ఇల్లంతా బాగా పరిచయం అయిపోయిందేమో ఇంక చూడండి . ఇక్కడ అక్కడ అని లేదు ఇల్లంతా దాని ఇష్టారాజ్యమే . బట్టలు కొట్టేయడం మొదలుపెట్టింది . అందరూ ఉండగానే దైర్యంగా తిరగటం మొదలయింది . చూసి మాకు ఇంక సీరియస్ గా తీసుకోవాలని అర్ధం అయింది .        బ్లూక్రాస్ వాళ్ళు ఏమన్నా అననీ గాని దాని అంతు చూడకపోతే మా పని పట్టేసేటట్టు ఉంది దీని వాలకం చ...

మాటే మంత్రము....

మన మాట్లాడే ప్రతి మాటకు అర్ధం ఉండాలి . సందర్భం ఉండాలి . మాట యొక్క ఫలితం ఆలోచించి మాట్లాడాలి . మనం కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతాము .          అధికంగా మాట్లాడితే ప్రశాంతత కోల్పోతాము .          అనవసరంగా మాట్లాడితే అర్ధాన్ని కోల్పోతాము .          అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతాము .          అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతాము .          ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తాము .        కనుక మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడాలి అని ఆర్యోక్తి .

మన 'ఘన' దేశం

చిత్రం
ఈనాడు దినపత్రికలో వచ్చిన ఈ వార్తను చూసి వ్రాస్తున్నా . మన దేశ   జనాభా సుమారు నూట పది కోట్లు దాటింది . కాని మన దేశం నుంచి ఒలింపిక్స్ లో పతకాలు సాధించే వారెందరు , నోబెల్ బహుమతులు సాధించిన శాస్త్రవేత్తలు ఎందరు , అని చాలామంది బాధ పడుతుంటారు . మన దేశంలోనూ గుర్తించదగిన పరిశోధనలు చేసే సంస్థలు , శాస్త్రవేత్తలు ఉన్నారు . కాని ఇంకా సాధించాల్సిన మైలురాళ్ళు ఎన్నో ఉన్నాయి . పరిశోధించాల్సిన అంశాలు ఉన్నాయి . నిజానికి మన దేశం గతమెంతో ఘనకీర్తి కలిగినది . మరి ఆ గతాన్ని మర్చిపోకుండా , వర్తమానంలో తగిన కృషి చేస్తే భవిష్యత్తు మనదే . ఒకసారి వెనక్కి చూస్తే ప్రపంచానికి మార్గదర్శకులుగా నిలచిన రంగాలెన్నో .        తక్షశిల , నలంద విశ్వవిద్యాలయాలలో వేలమంది విద్యార్ధులు దేశ విదేశాలనుంచి వచ్చి చదువుకొన్నారు . అశోకుడు విద్యాభ్యాసం చేసింది తక్షశిల విశ్వవిద్యాలయంలోనే . అర్ధశాస్త్రాన్ని రచించిన చాణక్యుడు ఇక్కడే ఆర్ధికశాస్త్ర విభాగ అధిపతిగా పనిచేసారు . గురుకుల విద్యావిధానాన్ని ప్రపంచానికి ప...